
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
వజ్రపుకొత్తూరు/టెక్కలి రూరల్ : పూండి రైల్వే అండర్ పాసేజ్ సమీపంలో మంగళవారం రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గోవిందపురం గ్రామానికి చెందిన గుంట చంటి స్కూటీపై పూండి బస్టాండ్కు వెళుతుండగా ఎదురుగా అతివేగంతో బైక్పై వస్తున్న మెళియాపుట్టి మండలం కంజాలకు చెందిన శివ అనే యువకుడు ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరూ గాయపడటంతో స్థానికులు స్పందించి 108 అంబులెన్సులో టెక్కలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. చంటి పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళం రిమ్స్కు రిఫర్ చేశారు. ఫిర్యాదు అందిన అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని వజ్రపుకొత్తూరు ఎస్ఐ బి.నిహర్ తెలిపారు.