
ఏఓబీలో సారా స్థావరాలపై దాడులు
● 1,520 లీటర్ల సారా స్వాధీనం
పాతపట్నం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో అక్రమంగా నిర్వహిస్తున్న సారా తయారీ స్థావరాలపై ఆంధ్ర, ఒడిశా ఎకై ్సజ్ అధికారులు సంయుక్తంగా మంగళవారం దాడులు నిర్వహించారు. పాతపట్నం, మెళియాపుట్టి, కొత్తూరు మండలాలకు ఆనుకుని ఉన్న ఒడిశా గ్రామాలైన శిరడా, గురిసింగిగూడ, కొత్తగూడ, దిద్దిన గూడ, తమిళగూడ పరిసరాల్లో 1,520 లీటర్ల సారా, 7,700 లీటర్ల బెల్లం ఊటలను గుర్తించి ధ్వంసం చేశారు. తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సారా తయారీ, విక్రయాలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని పాతపట్నం ఎకై ్సజ్ సీఐ కోట కృష్ణారావు హెచ్చరించారు. ఈ దాడుల్లో గజపతి జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ కుమార్ సాహూ, ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ ఎం.శ్రీనివాసరావు, పాతపట్నం, కొత్తూరు, పలాస, శ్రీకాకుళం, పలాస టాస్క్ఫోర్స్ ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.