సచివాలయ ఉద్యోగుల నిరసన | - | Sakshi
Sakshi News home page

సచివాలయ ఉద్యోగుల నిరసన

Jun 25 2025 7:08 AM | Updated on Jun 25 2025 7:08 AM

సచివాలయ ఉద్యోగుల నిరసన

సచివాలయ ఉద్యోగుల నిరసన

రణస్థలం: గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం రణస్థలంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ సచివాలయ ఉద్యోగుల బదిలీలు, రేషనలైజేషన్‌కు సంబంధించిన జీఓ 5 పునఃపరిశీలించి సొంత మండలాల్లోనే పోస్టింగులు ఇచ్చేలా మార్పులు చేయాలని డిమాండ్‌ చేశారు. రేషనలైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేశాకే బదిలీలు చేపట్టాలన్నారు. మిగులు ఉద్యోగులను ఎక్కడ నియమిస్తారో స్పష్టత ఇవ్వాలని కోరారు. సచివాలయ ఉద్యోగులందరికి ప్రమోషన్‌ చానల్‌ కల్పించాక రేషనలైజేషన్‌ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. జాయినింగ్‌ తేదీ నుంచి సర్వీసును పరిగణనలోకి తీసుకుని రెండు నోషనల్‌ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు. ఆలస్యంగా ప్రొహిబిషన్‌ ప్రకటించినందుకు తొమ్మిది నెలల ఎరియర్స్‌ మంజూరు చేయాలన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మన్నాయుడులు వీరికి సంఘీభావం తెలిపారు. అనంతరం ఎంపీడీవో ఎం.ఈశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement