
సంబరాలకు వేళాయె..!
● కంచిలిలో నేటి నుంచి కంచమ్మతల్లి ఉత్సవాలు ● తొమ్మిది రోజులపాటు నిర్వహణ ● భారీ విద్యుత్ అలంకరణలతో ముస్తాబు
కంచిలి : మండల కేంద్రం కంచిలిలో కొలువై ఉన్న కంచమ్మతల్లి అమ్మవారి ఉత్సవాలు ఆదివారం రాత్రి నుంచి ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజులపాటు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 10వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలకు ఆరు నెలల నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు గ్రామస్తులు సమావేశమై ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. భారీ స్థాయిలో విద్యుత అలంకరణ చేపట్టారు. పది రోజులపాటు పురవీధుల్లో అమ్మవారిని ఊరేగించనున్నారు. 2015లో చివరి సారిగా గ్రామదేవత ఉత్సవాలు నిర్వహించారు. మళ్లీ పదేళ్ల తర్వాత జరుగుతుండటంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాత్రి అమ్మవారిని గ్రామంలోకి ఆహ్వానం పలకడానికి సర్వం సిద్ధం చేశారు.
నమూనా విగ్రహం ఏర్పాటు..
భక్తుల దర్శనార్ధమై అమ్మవారికి వజ్రవైడూర్యాలు, బంగా రు ముత్యాలహారం, బంగారు జడపాళి, వెండి మకరతోరణం, వెండి కవచం, బంగారు అభయహస్తం తదితర ఆభరణాలను అమ్మవారి నమూనా విగ్రహానికి అలంకరించా రు. ఈ విగ్రహాన్ని స్థానిక రైల్వేస్టేషన్ కూడలి వద్ద పీఠస్థా నంసమీపంలో మెయిన్రోడ్డు పక్కన ఏర్పాటు చేస్తున్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలివే..
అమ్మవారి ఊరేగింపుతోపాటు వివిధ సాంస్కృతిక కార్యక్ర
మాలను కూడా నిర్వహించనున్నారు. ఒకటో తేదీ రాత్రి అమ్మవారిని కాళికాదేవి నృత్యనాట్య ప్రదర్శనలతో ఆర్భాటంగా ఆహ్వానించనున్నారు. 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం అమ్మవారి ఆభరణాలు పెట్టెను మేళతాళాలతో ఊరేగింపుగా పీఠస్థానం వద్దకు తీసుకొస్తారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు అమ్మవారి ఊరగింపుతోపాటు గ్రామదేవతలు, గ్రూపు డ్యాన్స్లు, కోలాటం, పాలబొమ్మలు, తీన్మార్, చైనా కోబ్రా తదితర కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు. ప్రతి రోజు రాత్రి 8 గంటల నుంచి కంచిలి జూనియర్ కళాశాల మైదానంలో వివిధ స్టేజి ప్రోగ్రామ్లు నిర్వహించనున్నారు.

సంబరాలకు వేళాయె..!

సంబరాలకు వేళాయె..!