నేడు ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాక | - | Sakshi
Sakshi News home page

నేడు ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాక

May 31 2025 12:52 AM | Updated on May 31 2025 5:04 PM

నరసన్నపేట: పీఆర్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌ శనివారం మండలానికి వస్తున్నారని డ్వామా పీడీ సుధాకర్‌ అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఆయన సెక్రటరీ రాక సందర్భంగా శుక్రవారం సాయంత్రం స్థానిక అధికారులతో సమీక్షించారు. నరసన్నపేట, బొరిగివలస, లుకలాంల్లో ఆయన పర్యటిస్తారని తెలిపారు. కార్యక్రమాల్లో స్థానిక అధికారులు పాల్గొనాలని సూచించారు. సమీక్షలో ఎంపీడీఓ మధుసూదనరావు, ఏపీఓ యుగందర్‌లతో పాటు పీఆర్‌ ఇంజినీర్లు పాల్గొన్నారు.

రేపు మోడల్‌ డీఎస్సీ పరీక్ష

శ్రీకాకుళం న్యూకాలనీ: పీఆర్‌టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మోడల్‌ డీఎస్సీ–2025 ఎస్‌జీటీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.మురళీమోహన్‌రావు, డి.కేవశరావు తెలిపా రు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అరసవల్లి సూర్యనారాయణస్వా మి దేవస్థానం సమీపంలో ఉన్న పీఆర్‌టీయూ భవనంలో ఉదయం 9 గంటలకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కారు ఢీకొని పరిశ్రమ ఉద్యోగికి గాయాలు

ఎచ్చెర్ల క్యాంపస్‌ : అల్లినగరం కూడలి సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పైడి భీమవరం అరబిందో పరిశ్రమ ఉద్యోగి గాయపడ్డాడు. గార మండలం శ్రీకూర్మం గ్రామానికి చెందిన పందిరి పాపారావు శుక్రవారం బైక్‌పై విధులకు వెళ్తుండగా అల్లినగరం కూడలి సమీపంలో వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పాపారావును 108 అంబులెన్స్‌లో శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు వైద్యులు రిఫర్‌ చేయగా కుటుంబ సభ్యులు శ్రీకాకుళం రూరల్‌ మండలంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. రిమ్స్‌ ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేశారు.

గోవులు స్వాధీనం

ఎచ్చెర్ల: నరసన్నపేట వైపు నుంచి విశాఖపట్న ం వైపు బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది ఆవులను శుక్రవారం లావేరు మండలం బుడుమూరు వద్ద జాతీయ రహదారిపై ఎస్సై జి.లక్ష్మణరావు పట్టుకున్నారు. వ్యాన్‌ డ్రైవర్‌ పోలవరపు నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వివాహిత అనుమానాస్పద మృతి

కొత్తూరు: మహర్తాపురంలో ప్రవళ్లిక (26) అనే వివాహిత శుక్రవారం అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కొత్తూరు ఎస్‌ఐ ఎండీ అమీర్‌ ఆలీ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం వడ్డంగి గ్రామానికి చెందిన పత్తిక సురేష్‌కు గుమ్మలక్ష్మిపురం మండలం కేదారపురం గ్రామానికి చెందిన నమ్మక ప్రవళ్లికతో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. సురేష్‌ జియో టవర్‌ కంపెనీలో పనిచేస్తున్నందున కొత్తూరులోని మహర్తాపురంలో భార్యతో కలిసి నివాసముంటున్నాడు. ఎప్పటిలాగే సురేష్‌ శుక్రవారం విధులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి ప్రవళ్లిక ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వగా పోలీసులు వచ్చి వివరాలు సేకరించారు. 

కాగా, అల్లుడు సురేష్‌ అదనపు కట్నం తీసుకురావాలని నిత్యం వేధింపులకు గురి చేస్తున్నందున కుమార్తె ప్రవళ్లిక ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లి అరుణకుమారి ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా, భర్త సురేష్‌ వేధిస్తున్నట్లు ప్రవళ్లిక గతంలోనూ బత్తిలి, గుమ్మలక్ష్మిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు

ఎచ్చెర్ల : రైతులు సాగు యాజమాన్య పద్ధతులను పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి త్రినాథస్వామి తెలిపారు. చిలకపాలెంలో వికసిత కృషి సంకల్ప అభియాన్‌ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాగోలు వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్త డాక్టర్‌ ఉదయ్‌బాబు మాట్లాడుతూ వరి రకాలు, తెగుళ్లను వివరించారు. అనంతరం నవధాన్యాలు, విత్తనాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ గాంధీ, వ్యవసాయ సహాయ సంచాలకులు బగ్గు రజనీ, భవానీశంకర్‌, కేవీకే శాస్త్రవేత్త సునీత, మండల ఇన్‌చార్జి వ్యవసాయాధికారి దుర్గాప్రసాద్‌, ప్రకృతి మాస్టర్‌ ట్రైనర్‌ నాయుడు, విస్తరణాధికారులు జగన్మోహనరావు, రేవతి తదితరులు పాల్గొన్నారు.

నేడు ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాక 1
1/1

నేడు ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement