నేటి నుంచి టెన్త్‌ సప్లిమెంటరీ మూల్యాంకనం | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి టెన్త్‌ సప్లిమెంటరీ మూల్యాంకనం

May 31 2025 12:52 AM | Updated on May 31 2025 12:52 AM

నేటి నుంచి టెన్త్‌ సప్లిమెంటరీ మూల్యాంకనం

నేటి నుంచి టెన్త్‌ సప్లిమెంటరీ మూల్యాంకనం

శ్రీకాకుళం న్యూకాలనీ: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం శనివారం నుంచి మొదలుకానుంది. శ్రీకాకుళం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల కేంద్రంగా మూడు రోజులపాటు జరిగే ఈ స్పాట్‌ జూన్‌ రెండో తేదీ వరకు కొనసాగనుంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కోడింగ్‌ ప్రక్రియ శరవేగంగా పూర్తిచేస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించే ఈ ప్రక్రియలో మొత్తం ఏడు పేపర్లకు సంబంధించిన 10,080 జవాబుపత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. చీఫ్‌ ఎగ్జామినర్లు, అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు, స్పెషల్‌ అసిస్టెంట్లు కలిపి 250 మందిని నియమించారు. జిల్లా క్యాంప్‌ ఆఫీసర్‌గా డీఈఓ డాక్టర్‌ తిరుమల చైతన్య నేతృత్వంలో స్ట్రాంగ్‌రూమ్‌ డిప్యూటీ క్యాంప్‌ ఆఫీసర్‌గా అసిస్టెంట్‌ కమిషనర్‌ లియాకత్‌ ఆలీఖాన్‌, ఉపవిద్యాశాఖాధికారి విజయకుమారి డిప్యూటీ క్యాంప్‌ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement