
అంతిమ సంస్కారాలకు అవస్థలు
పాతపట్నం: మండలంలోని సింగుపురం గ్రామంలో ఉంటున్న దళితులు స్మశాన వాటిక లేక ఇబ్బంది పడుతున్నారని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు కోళ్ల చిన్నరావు, యడ్ల గోపి అన్నారు.
గురువారం సింగుపురం గ్రామంలో డప్పు కళాకారుడు మీసాల వెంకటరావు (38) అనారోగ్యంతో మృతి చెందాడు. మృతదేహాన్ని పంట పొలాల మీదుగా అంత్యక్రియలకు తీసుకువెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అధికారులకు విన్నవించామని, అయినా ఫలితం లేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్మశాన వాటికకు రహదారి నిర్మాణం చేపట్టాలని కోరారు.