
ఆటో బోల్తా: నలుగురికి గాయాలు
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్లలో పాత జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. శ్రీకాకుళం వైపు వెళుతున్న ఆటో ప్రయాణికులను ఎక్కిస్తుండగా వెనుక నుంచి మరో ఆటో వచ్చి ఢీకొట్టింది. దీంతో ఢీ కొట్టిన ఆటో బోల్తా పడగా.. ముందు ఉన్న బండి ఓ వైపునకు ఒరిగిపోయింది. రెండు ఆటోల్లో పది మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. వారిలో లక్ష్మమ్మ, భాగ్యవతి, అమ్మన్నమ్మ, శోభామణి గాయపడ్డారు. వీరిని 108 అంబులెన్స్లో శ్రీకాకుళం రిమ్స్లో చేర్పించారు. ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గాయపడిన వారిది పొందూరు మండలం తాడివలస గ్రామం.