
సైనికుల్లా పనిచేద్దాం..
మళ్లీ అధికారం సాధిద్దాం
సూపర్ సిక్స్ హామీల్లో ఏ ఒక్కటీ కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. 50 ఏళ్లకు ఇస్తామన్న పెన్షన్ ఊసే లేదు. వైఎస్సార్ సీపీ వర్గాలన్నీ కలిసికట్టుగా పనిచేసి మళ్లీ అధికారం సాధించాలి.
– ధర్మాన కృష్ణదాస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు
జన హృదయాలు గెలిచేది జగన్ మాత్రమే..
కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. పార్టీకి శక్తివంతంగా తీర్చిదిద్దాలంటే కార్యకర్తలు, నాయకుల సహకారం అవసరం. ప్రజల హృదయాలను గెలిచే నేత ఒక్క వైఎస్ జగన్ మాత్రమే. – తమ్మినేని సీతారాం, పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ సమన్వయకర్త
జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం
జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే కలెక్టరేట్ వద్ద నిరసనలు చేస్తూ వినతి పత్రాలు అందిస్తూ ఈ ప్రభుత్వానికి సాగనంపాలి. అలాగే జూన్ 12న చీకటి రోజుగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు చేపడుతూ గతంలో మనం చేసిన అభివృద్ధిని వివరిద్దాం. – సీదిరి అప్పలరాజు, పార్టీ రాష్ట్ర డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు
కుట్ర జరుగుతోంది
కూటమి ప్రభుత్వ నాయకుల మాటలు వింటే రక్తం మరిగిపోతుంది. రాష్ట్రంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తామనడంలో ఏదో కుట్ర జరుగుతోంది.
– పేరాడ తిలక్, టెక్కలి సమన్వయకర్త
తేడా జనమే గమనించారు
పాలనలో చంద్రబాబు విఫలమయ్యారు. చంద్రబాబు 15 ఏళ్ల పాలనకు జగన్ ఐదేళ్ల పాలనకు తేడాను ప్రజలు గమనించారు. – చింతాడ రవి,
ఆమదాలవలస సమన్వయకర్త
సమన్వయంతో
సాగుదాం..
శ్రీకాకుళం రూరల్:
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, రానున్న రోజుల్లో ప్రజలే చంద్రబాబుకు బుద్ధి చెబుతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలకుడు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు ధ్వజమెత్తా రు. జిల్లా కేంద్రంలోని పాత్రునివలస జాతీయ రహదారి వద్ద గల పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ ముఖ్య నాయకులు, నియోజకవర్గాల సమన్వయకర్తలతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పగ్గాలు చేపట్టిన 11 నెలల్లోనే లక్షా నలభై వేల కోట్లు అప్పు చేశారని, ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తెచ్చి అమరావతిలో పెడితే ప్రజలపై పెనుభారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సంపద సృష్టించడం అంటే అప్పు చేయడమేనా అని సూటిగా ప్రశ్నించారు. ఆరు నెలల్లోనే కూటమి పాలనపై జనాల్లో అసంతృప్తి కనిపిస్తోందన్నారు. అధికారం స్వీకరించినపు డు రాజ్యాంగంపై ప్రమాణం చేసిన చంద్రబాబు ఇప్పుడు మాట తప్పుతున్నారని అన్నారు. వైఎస్సార్ సీపీ వర్గాలకు సంక్షేమ పథకాలు ఇవ్వకూడదని సాక్షాత్తు సీఎం బహిరంగ సభల్లో చెప్పడం సబబు కాదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 16 మంది ముఖ్యమంత్రుల హయాంలో కేవలం 58 ఏళ్లలో రూ.1.26 లక్షల కోట్లు అప్పు ఉంటే చంద్రబా బుహయాంలో మాత్రం అప్పు కుప్పలైందన్నారు. 2014– 19లో చంద్రబాబు పరిపాలనలో రూ.2లక్షల 50వేల కోట్లు అప్పు చూపించారన్నారు.
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు 70 లక్షల ఎకరాలకు సాగునీరు అవసరం ఉంటుందని, పోలవరం నుంచి ఇక్కడకు సాగునీరు రాకుండా ఎత్తును తగ్గించే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో భాగంగా క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా ఎన్నికై న పాతపట్నం సమన్వయకర్త రెడ్డి శాంతికి పార్టీ కేడర్ అంతా అభినందలు తెలుపుతూ సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ కళింగ వైశ్య, తూర్పు కాపు కుల విభాగ రాష్ట్ర అధ్యక్షులు అంధవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, ఎంపీపీ గొండు రఘరామ్, అంబటి శ్రీనివాస్రావు, పోలాకి జెడ్పీటీసీ ధర్మాక కృష్ణ చైతన్య, జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, ఎచ్చెర్ల శ్రీధర్, ఎం.స్వరూప్, గొండు కృష్ణ, జిల్లా పార్టీ గ్రీవెన్స్ విభాగపు అధ్యక్షుడు రౌతు శంకరావు, మార్పు పృథ్వీ, తమ్మినేని చిరంజీవినాగ్, చిట్టి జనార్దన రావు, మూకళ్ల తాతబాబు, గంగు నరేంద్ర, గుండ హరేష్, ముంజేటి కృష్ణ, ఎన్ని ధనుంజయ పాల్గొన్నారు.
హామీలు తుంగలోకి తొక్కారు
టీడీపీ ఏడాది పరిపాలనలో ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కింది. రాను న్న రోజుల్లో కూటమి పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారు. – పిరియా విజయ, జెడ్పీ చైర్ పర్సన్
అభివృద్ధి గురించి చెప్పాలి
టీడీపీ అరాచకాలు బయట పెట్టాలంటే ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేయాలి. వైఎస్సార్ సీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని చాటి చెప్పాలి. – నర్తు రామారావు, ఎమ్మెల్సీ
ప్రజలతోనే ముందుకు..
కూటమి ప్రభుత్వం తప్పులను ప్రజల్లోకి తీసుకెళదాం. ప్రజా సమస్యలపై పోరాడదాం. అందరం కలిసికట్టుగా పనిచేసి మందుకు సాగుదాం.
–గొర్లె కిరణ్ కుమార్, ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే
సంపద సృష్టి అంటే అప్పు చేయడమేనా..?
11 నెలల బాబు పాలనలోనే రూ.1.40 లక్షల కోట్లు అప్పు
అప్పు చేసి అమరావతికి పెడితే ప్రజలపై పెనుభారం
ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలకుడు కుంభా రవిబాబు
కూటమిది అరాచక పాలన అంటూ మండిపాటు
సమష్టిగా పనిచేయాలని పార్టీశ్రేణులకు పిలుపు
టీడీపీ విఫలమైంది
2019–24లో జగన్ హయాంలో అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో ప్రజలకు తెలుసు. టీడీపీ పూర్తిగా విఫలమైంది. – రెడ్డి శాంతి, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే

సైనికుల్లా పనిచేద్దాం..

సైనికుల్లా పనిచేద్దాం..

సైనికుల్లా పనిచేద్దాం..

సైనికుల్లా పనిచేద్దాం..

సైనికుల్లా పనిచేద్దాం..

సైనికుల్లా పనిచేద్దాం..

సైనికుల్లా పనిచేద్దాం..

సైనికుల్లా పనిచేద్దాం..

సైనికుల్లా పనిచేద్దాం..

సైనికుల్లా పనిచేద్దాం..