
సజావుగా ఏపీ ఈఏపీసెట్
ఎచ్చెర్ల క్యాంపస్: ఏపీ ఈఏపీ సెట్–2025 సజావుగా సాగుతోంది. ప్రస్తుతం ఎంపీసీ స్ట్రీం పరీక్షలు జరుగుతున్నాయి. చిలకపాలెంలోని శ్రీ శివానీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో మొదటి షిఫ్టులో 280 మందికి, 268, రెండో షిఫ్టులో 280 మందికి 266 మంది హాజరయ్యారు. ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజ్లో జరిగిన పరీక్షల్లో మొదటి షిఫ్టులో 170 మందికి 160, రెండో షిఫ్టులో 170 మందికి 163 మంది హాజరయ్యారు. ఈ నెల 27వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.
ఘనంగా ఆదిత్యుని కల్యాణం
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి కల్యాణోత్సవం శుక్రవారం ఉదయం ఆలయ అనివెటి మండపంలో ఘనంగా జరిగింది. వైశాఖ బహుళ ఏకాదశి సందర్భంగా శ్రీ ఉషా పద్మినీ ఛాయా సమేత సూర్యనారాయణస్వామి కల్యాణమూర్తులకు ఆగమ శాస్త్రం ప్రకారం కల్యాణ ప్రక్రియను పూర్తి చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య ఈ కల్యాణాన్ని జరిపించారు.
యోగాతో శారీరక ఆరోగ్యం, మానసిక దృఢత్వం
శ్రీకాకుళంఅర్బన్: యోగాతోశారీరక ఆరోగ్యం, మానసిక దృఢత్వం లభిస్తుందని సీ్త్ర, మహిళా శిశు సంక్షేమశాఖ పథక సంచాలకులు బగాది శాంతిశ్రీ అన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచనల మేరకు శుక్రవారం శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్డులో సీ్త్ర, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యోగా శిబిరం నిర్వహించారు. శిబిరంలో ఐసీడీఎస్ సిబ్బంది, చిల్డ్రన్ హోమ్స్కు చెందిన చిన్నారులు మొత్తం 700 మందికి పైగా పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆయుష్ సమన్వయ అధికారి జగదీ ష్, నోడల్ అధికారి మనెమ్మ పాల్గొన్నారు.

సజావుగా ఏపీ ఈఏపీసెట్

సజావుగా ఏపీ ఈఏపీసెట్