
అక్రమ నిర్మాణ స్థల పరిశీలన
కవిటి: ‘సర్కారు వారి జాగాలో.. ’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై పంచాయతీ అధికారులు స్పందించారు. శుక్రవారం సంబంధిత అక్రమ నిర్మాణం జరుగుతున్న స్థలాన్ని పరిశీలించారు. కలెక్టర్ కార్యాలయంలో ఓ సమావేశానికి ఈఓ వీరభద్రస్వామి హాజరైన నేపథ్యంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ భూపతి, సిబ్బంది సుదర్శన్, నూకరాజు నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు ఎలాంటి నిర్మాణం చేసినా చట్టపరమైన కేసులు ఎదుర్కో వాల్సి ఉంటుందని నిర్మాణదారుడిని హెచ్చరించారు. వీఆర్ఓ ఎస్.నారా యణ, వీఆర్ఏ కాళిదాస్లు సైతం నాలా కన్వర్షన్ సర్టిఫికెట్ చూపాలని కోరారు. పత్రం చూపిన తర్వాత ఇందులో ఆర్అండ్బీ స్థలం ఎంత, జిరాయితీ స్థలం ఎంత అనే అంశాలను లెక్కచూస్తామని తెలిపారు. అప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని సూచించారు.
నైట్ పెట్రోలింగ్ విధుల్లో
ఎకై ్సజ్ పోలీసులు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లావ్యాప్తంగా ఉన్న 176 మద్యం దుకాణాలు, 18 బార్ అండ్ రెస్టారెంట్లలో అక్రమాలకు తావులేకుండా పూర్తిస్థాయి లో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ నిఘా పెట్టనుందని సంబంధిత శాఖ డిప్యూటీ కమిషనర్ దోసకాయల శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో ఉన్న 12 స్టేషన్ల పరిధిలో స్టేషన్ అధికారి, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు రొటేషన్ పద్ధతిలో ప్రతిరోజూ నైట్ పెట్రోలింగ్ విధుల్లో పాల్గొనేలా కార్యాచరణ చేశామని శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. బార్ అండ్ రెస్టారెంట్ల వద్ద రాత్రి 9 నుంచి 11 గంటల వరకు, దుకాణాల వద్ద 8 నుంచి 10 గంటల వరకు ఈ విధులుంటాయన్నారు. ఎకై ్సజ్ ‘ఐ’ అనే మొబై ల్ అప్లికేషన్ కూడా త్వరలో వెబ్సైట్లో పెట్టనున్నామని తెలిపారు. ఎకై ్సజ్ నేరాలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులుంటే టోల్ఫ్రీ నంబర్ 14405 కి కాల్ చేసి తెలియజేయాలన్నారు.

అక్రమ నిర్మాణ స్థల పరిశీలన