
మినీ మహానాడు వెలవెల
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన మినీ మహానాడు వెలవెలబోయింది. సాయంత్రం 4గంటలకు ప్రారంభం కావాల్సిన మినీమహానాడును రెండు గంటల పాటు ఆలస్యంగా ప్రారంభించారు. జనా లు లేకపోవడంతో అప్పటికప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. 6.30గంటలకు సభ ప్రారంభం కాగా 8.30గంటల వరకూ కొనసాగింది. కేంద్రమంత్రి వచ్చే సమయానికి ఆయనతో పాటు కొందరు కార్యకర్తలు, నాయకులు వస్తారని భావించినప్పటికీ అది కూడా జరగకపోవడంతో ఉన్న వారితోనే చర్చ ప్రారంభమైంది. కార్యాలయ ప్రాంగణంలో సగానికి పైగా కుర్చీలు ఖాళీగా ఉండిపోయాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీని వాస్, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులు మినీ మహానాడుకు గైర్హాజరయ్యారు. అలాగే ప్రభు త్వ విప్ బెందాళం అశోక్, పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీషలు సైతం సమావేశానికి హాజరుకాలేదు.