
వ్యక్తిపై గృహహింస కేసు నమోదు
ఎచ్చెర్ల క్యాంపస్: కొయ్యాం పంచాయతీ కొత్తకూర్మినాయుడుపేట గ్రామానికి చెందిన బోర పైడిరాజు పై ఎచ్చెర్ల పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. తనను వేధిస్తున్నట్లు భార్య భారతి ఫిర్యా దు చేసింది. వీరికి పదేళ్ల క్రితం వివాహమైంది. రో జూ మద్యం తాగి కొట్టటం, హింసించటం చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది.
చనిపోయిన వృద్ధుని వివరాలు లభ్యం
ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళంలోని సింహద్వారం సమీపంలో ఈ నెల 17న ఓ వృద్ధుడు అపస్మారక స్థితిలో పడి ఉండగా 108లో శ్రీకాకుళం రిమ్స్లో చేర్పించారు. ఆ వృద్ధుడు ఆస్పత్రిలో చనిపోయా డు. ఆయన వివరాలు గురువారం దొరికాయి. ఈ వ్యక్తిని సరుబుజ్జిలి మండలం గోనెపాడు గ్రామాని కి చెందిన బిర్లంగి రామ్మూర్తిగా గుర్తించి, మృత దేహాన్ని బంధువులకు పోలీసులు అప్పగించారు.
ఏఎంసీలో మెడికో ఆత్మహత్య
డాబాగార్డెన్స్: ఆంధ్ర మెడికల్ కళాశాల(ఏఎంసీ) పీజీ హాస్టల్లో గురువారం ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాలివి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మోతీలాల్ (25) రేడియాలజీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలలో చేరి కేవలం మూడు నెలలే అయింది. మెరిట్ విద్యార్థి అయిన మోతీలాల్ వ్యక్తిగత కారణాల వల్ల మృతి చెందాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ప్రొఫెసర్ల వేధింపుల కారణంగానే అతను ఆత్మహత్య చేసుకున్నాడని అతని స్నేహితులు ఆరోపిస్తున్నారు. వన్టౌన్ పోలీసులు ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రైలు ఢీకొని వృద్ధుడు మృతి
ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్డు ఆమదాలవలస రైల్వే స్టేషన్ సమీపంలో గురువా రం రైలు ఢీకొని బి.మల్లేష్ (79) అనే వృద్ధుడు మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ మ ధుసూదనరావు తెలిపా రు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం మండలం తండేవలస గ్రామానికి చెందిన మల్లేష్ బమ్మిడివానిపేట రైల్వే గేటు వద్ద పట్టాలు దాటుతున్న సమయంలో రైలు ఢీకొ న్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్కు తరలించినట్లు పేర్కొన్నారు.