
సర్కారు వారి జాగాలో..
● ఎస్కేఈ రోడ్డు పక్కనే కూటమి నేత అక్రమ నిర్మాణాలు ● కనీస నిబంధనలు పాటించని వైనం ● నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం
కవిటి:
అధికారంలోకి వచ్చాక కూటమి నాయకులకు ప్రభుత్వ స్థలాలు కూడా సొంత జాగాలైపోతున్నా యి. మొన్నటికి మొన్నే రాజపురం వెళ్లే మార్గంలో ప్రభుత్వ స్థలాన్ని మట్టివేసి చదును చేయించి కాజే సే ప్రయత్నం చేశారు. ఆ సంగతి మరువక ముందే మళ్లీ సోంపేట–కవిటి–ఈదుపురం (ఎస్కేఈ రోడ్డు) పక్కనే మరో టీడీపీ నాయకుడు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపడుతున్నా రు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నా యి. ఎస్కేఈ రోడ్డు నుంచి నెలవంక వెళ్లే రోడ్డు మలుపులో పంచాయతీ విశ్రాంతి భవనానికి ఆనుకునే ఓ అక్రమ నిర్మాణానికి ఓ టీడీపీ నేత పూనుకున్నాడు. వాస్తవానికి గతంలోనూ ఇలాగే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఓ భవనం కట్టేశాడు. సుడా అనుమతులు కూడా తీసుకోకుండా కరెంటు కనెక్షన్ కూడా తెప్పించుకున్నాడు. తాజాగా ఇప్పుడు విశ్రాంతి భవనానికి ఉద్దానం మంచినీటి పథకం ఓవర్ హెడ్ ట్యాంకుకు మధ్యన ఉన్న తన స్థలంలో ప్రభుత్వ స్థలం కలిపేసి నిర్మాణం చేసేందుకు పనులు ప్రారంభించేశాడు. పనుల్లో భాగంగా ఇక్కడున్న మర్రిచెట్టును కూల్చగా.. దాని కింద ఉన్న ఉద్దానం నీటిపథకం పైప్లైన్ ధ్వంసమైంది. దీంతో ప్రభుత్వ విప్ డాక్టర్ బెందాళం అశోక్ సొంత ఊరు (జంట గ్రామాలు) ప్రగడ పుట్టుగ, రామయ్య పుట్టుగలకు నీటిసరఫరా ఆగిపోయింది. విషయం తెలు సుకున్న పంచాయతీ అధికారులు హుటాహుటిన నష్టనివారణ చర్యలు చేపట్టారు. పైప్లైన్ బాగుచేసే పనులు చేయిస్తావా లేక పోలీసులకు ఫిర్యాదు చే యమంటావా అంటే మరమ్మతులు పనులు చేయించాడు.
దీంతో ఆ సమస్య సద్దుమణిగింది. కానీ అక్రమ నిర్మాణం మాత్రం ఒకటి పూర్తి కావ చ్చింది. ఇక్కడ వ్యవసాయ భూమిని వాణిజ్య అవసరాలకు వినియోగించినా నాలా కన్వర్షన్ చేసుకోలేదు. అయినా అధికారులు కిమ్మనడం లేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అనుమతులు లేవు..
ఎస్కేఈ రోడ్డుకు అనుకుని ఉన్న స్థలాల్లో ప్రగడపుట్టుగ జంక్షన్ విశ్రాంతి భవనం పక్కన కట్టిన నిర్మాణాలకు సుడా అనుమతుల కోసం ఎలాంటి దరఖాస్తులు రాలేదు. నిర్మాణదారుకు నిబంధనలను అనుసరించి శాఖాపరమైన చర్య లు ఎందుకు తీసుకోకూడదో తెలపాలంటూ నోటీసులు జారీ చేస్తాం.
– జి.వీరభద్రస్వామి, కవిటి పంచాయతీ ఈఓ
దరఖాస్తులు లేవు
ఎస్కేఈ రోడ్డులో వ్యవసాయ భూమిలో వ్యవసాయేతర అవసరాలకు ఉద్దేశించి వినియోగించే నిమిత్తం రైతుల నుంచి కానీ, నిర్మాణదారుల నుంచి కానీ నాలా కన్వర్షన్ కోసం దరఖాస్తులు అందలేదు. ఆ స్థలంలో వ్యవ సాయ భూమిలో ఏవైనా కట్టడాలు కడితే నిబంధనలకు విరుద్ధంగా ఉంటే శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేసే వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తాం.
– ఎస్.నారాయణ, వీఆర్ఓ, కవిటి రెవెన్యూ

సర్కారు వారి జాగాలో..

సర్కారు వారి జాగాలో..