
భగీరథ మహర్షి పట్టుదల స్ఫూర్తిదాయకం
శ్రీకాకుళం పాతబస్టాండ్: భగీరథ మహర్షి దివి నుంచి భువికి గంగను తెచ్చిన మహానుభావుడని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని జి ల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర రావు అన్నారు. ఆదివారం భగీరథ మహర్షి జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మరుగునపడిన వా రి జీవితాలను, మహనీయుల గొప్పతనాన్ని తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇ.అనురాధ, బీసీ సంక్షేమ శాఖ జాతీయ కార్యదర్శి డాక్టర్ బి.దేవభూషణరావు, ఉప్పర సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట రామారావు, సెక్రటరీ గజ్జల మాధవ రావు ఉపాధ్యక్షులు పిండి రాము, కలెక్టరెట్ ఏఓ సూర్యనారాయణ, బీసీ వెల్ఫేర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.