
ఉగ్ర చర్యలను ఖండించాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఉగ్రవాదం దేశ ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందని, అభివృద్ధికి ఆటంకమని డాక్టర్ కె.సుధీర్ అన్నారు. శ్రీకాకుళంలో నగరంలో ప్రజావేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ఏడురోడ్లు కూడలి నుంచి కోడిరామ్మూర్తి స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. డాక్టర్లు, లాయర్లు, కవులు, రచయితలు, పెన్షనర్లు, జేసీస్, మానవతా, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘం, ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రచయిత అట్టాడ అప్పలనాయుడు మాట్లాడుతూ ఉగ్రవాదానికి మతం రంగు పులమకూడదన్నారు. విద్యావేత్తలు డాక్టర్ జామి భీమశంకరం, ప్రొఫెసర్ విష్ణుమూర్తి మాట్లాడుతూ ఉగ్రవాదం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. కార్యక్రమంలో కేతవరపు శ్రీనివాస్, బి.కృష్ణమూర్తి, ఎం.ప్రభాకరరావు, ఎస్.కిషోర్కుమార్, కె.నాగమణి, ఉషారాణి, ఆర్.మల్లేశ్వరరావు, జోగినాయుడు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.