
గారలో వైద్య శిబిరం
గార: మండల కేంద్రం గార గ్రామంలోని సెగిడివీధిలో పలువురికి విషజ్వరాలు సోకడంతో శుక్రవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ‘గార గ్రామంలో విష జ్వరాలు’ శీర్షికన సాక్షిలో వార్త ప్రచురితం కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో గార పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రమ్య, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి రక్తనమూనాలు సేకరించారు. మలేరియా సబ్ యూనిట్ అధికారి డాక్టర్ సూర్యం గ్రామంలో పర్యటించారు. ప్రస్తుతానికి జ్వరాలు అదుపులోనే ఉన్నాయని, మలేరియా లార్వా ఎక్కడా లేవన్నారు. మరో రెండు రోజుల పాటు వైద్య శిబిరం నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. కొద్ది నెలల క్రితమే ఈ వీధిలో కొత్త పైపులైను వేసి సురక్షితమైన తాగునీరు అందిస్తున్నామని సర్పంచ్ మార్పు దుర్గాపృథ్వీరాజ్ తెలిపారు.

గారలో వైద్య శిబిరం