
గాయపడిన వ్యక్తి మృతి
ఎచ్చెర్ల క్యాంపస్:కింతలి మిల్లు సమీపంలో జాతీయ రహదారిపై బైక్పై వెళుతున్న బత్తిలి సత్యం (48) మార్చి 2న ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనం ఢీ కొట్టడంతో గాయపడిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం రిమ్స్లో చేరి చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడి స్వగ్రామం తోటపాలెం పంచాయతీ పెయిలవానిపేట. పోలీసులు కేసు నమోదు చేశారు.
స్తంభించిన ఆర్టీఏ సేవలు
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని తండేవలసలో ఉప రవాణా శాఖ కార్యాలయంలో శుక్రవారం సేవలు స్తంభించాయి. గురువారం రాత్రి కురిసిన ఈదురుగాలులు, వర్షాలకు ఎక్కడికక్కడే విద్యుత్ వైర్లు, కేబుల్ వైర్లు తెగడంతో సేవలు నిలిచిపోయాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల ఆర్టీఏ సేవలు మొరాయించాయి. దీంతో వివిధ పనుల కోసం వచ్చిన వాహనచోదకులకు నిరీక్షణ తప్పలేదు.