శివానీ ఇంజినీరింగ్‌ కళాశాలకు అటానమస్‌ హోదా | - | Sakshi
Sakshi News home page

శివానీ ఇంజినీరింగ్‌ కళాశాలకు అటానమస్‌ హోదా

Apr 29 2025 9:45 AM | Updated on Apr 29 2025 9:45 AM

శివానీ ఇంజినీరింగ్‌ కళాశాలకు అటానమస్‌ హోదా

శివానీ ఇంజినీరింగ్‌ కళాశాలకు అటానమస్‌ హోదా

ఎచ్చెర్ల క్యాంపస్‌: చిలకపాలేంలోని శ్రీ శివానీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌కు యూనివర్సిటీ ఆఫ్‌ గ్రాంట్స్‌ కమిషన్‌ అటానమస్‌ హోదా మంజూరు చేసిందని కళాశాల యాజమాన్య ప్రతినిధులు వెల్లడించారు. ఎచ్చెర్లలో సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ 2025–26 విద్యా సంవత్సరం నుంచి అటానమస్‌ అమల్లోకి వస్తుందని చెప్పారు. యూజీసీ బృందం ఫిబ్రవరి 16న కళాశాల సందర్శించి ఈ నెల 24న అటానమస్‌ హోదా ప్రకటించిందని తెలిపారు. నాక్‌, ఎన్‌బీఏ, జేఎన్‌టీయూ శాశ్వత గుర్తింపు వంటి ఆధారంగా అటానమస్‌ హోదా లభించిందని వివరించారు. ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో ఆరు ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌లు, ఎంటెక్‌ కోర్సులు, ఎంబీఏ కోర్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో కరిక్యులమ్‌, సిలబస్‌లో మార్పులు, మెరుగైన ప్లేస్‌మెంట్‌లు లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. 80 శాతం కామన్‌ కోర్‌ సిలబస్‌, స్థానిక అవసరాలకు అనుగుణంగా 20 శాతం బీవోఎస్‌ ద్వారా మార్పు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మేనేజ్‌మెంట్‌ సభ్యులు డాక్టర్‌ సనపల శ్రీనివాసరావు, దుప్పల వెంకటరావు, పి.దుర్గాప్రసాద్‌రావు, కె.దుర్గా శ్రీనివాస్‌, ఎంఎం సాయినాథ్‌ రెడ్డి, హరీ ష్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వై.శ్రీనివాసరావు, వైస్‌ ప్రిన్సిపాల్‌ జి.టి.చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement