
ఎమ్మెల్యే పీఏపై ఫిర్యాదు
నరసన్నపేట: ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రైవేటు పీఏ రావాడ గణపతిపై కరగాంకు చెందిన టీడీపీ కార్యకర్త యాళ్ల మల్లేశ్వరరావు నరసన్నపేట పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశా రు. ఇటీవల వీరిద్దరి మధ్య ఫోన్లో వాగ్వాదాలు జరగడం, ఈ ఫోన్ ఆడియో వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ కావడం, పేపర్లలో ప్రచురితం అయిన విషయం విదితమే. ఆడియోలో మల్లేశ్వరరావుకు గణపతి నరసన్నపేట వస్తే నీ అంతు చూస్తానని బెదిరించడంతో ఆయన పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ దుర్గాప్రసాద్ వద్ద ప్రస్తావించగా ఫిర్యాదు వచ్చిందని అన్నారు.