ఇచ్ఛాపురం టౌన్:
మున్సిపాలిటీలో ఆశీలు వ్యాపారం మూడుపువ్వులు ముప్పై కాయలుగా సాగుతోంది. మున్సిపాలిటీలో 23 వార్డుల్లోని ప్రభుత్వ స్థలాలు, బహిరంగ ప్రదేశాలు, రోడ్ల పక్కన ప్రదేశాల్లో పంటలు అమ్మినా, చిన్న బడ్డీ కొట్లు పెట్టినా మున్సిపాలిటీకి ఆశీలు చెల్లించాలి. ఈ పన్నుల వసూలుకు ఏడాదికి ఓ సారి వేలం నిర్వహిస్తారు. ఈ పన్నులకు సంబంధించి ధరల బోర్డు బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించాలి. కానీ ప్రదర్శించడం లేదు. రశీదులు కూడా ఏదో కొద్దిమందికే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. అధికారుల తనిఖీలు కూడా కానరావడం లేదు. దీంతో కాంట్రాక్టర్లు ఇదే అదనుగా దోచుకుంటున్నారు.
ధరల బోర్డు పెడతాం
ఆశీలుకు సంబంధించి ధరల బోర్డు బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శిస్తామని మున్సిపల్ కమిషనర్ ఎన్.రమేష్ తెలిపారు. ఆశీలు వసూళ్లపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తామన్నారు.