భారీ సంఖ్యలో ర్యాలీగా వస్తున్న ఉపాధ్యాయులు
శ్రీకాకుళం న్యూకాలనీ: కుప్పిలి మాస్ కాపీయింగ్ ఘటనలో డీఈఓ తీరును టీచర్లు నిరసిస్తూ మంగళవారం భారీ ఎత్తున జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టారు. డీఈఓ తిరుమల చైతన్యను వెంటనే సస్పెండ్ చేసి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నగరంలో వైఎస్సార్ స ర్కిల్ వద్ద మొదలైన ఈ ర్యాలీ జీటీరోడ్, సూర్యమహల్ మీదుగా డీఈఓ కార్యాలయం వద్దకు చేరుకుంది. అక్కడ నిరసన చేపట్టారు. ముందుస్తుగా పోలీసులు మోహరించడంతో డీఈఓ కార్యాల యం లోపలకు అనుమతించలేదు. జిల్లా పరు వును, ప్రతిష్టను జిల్లా విద్యాశాఖాధికారిగా తిరుమల చైతన్య మంటగలిపారని ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక నాయకులు కొప్పల భానుమూర్తి, గొంటి గిరిధర్, తంగి మురళీమోహన్, చౌదరి రవీంద్ర, పిసిని వసంతరావు, మజ్జి మదన్మోహన్, దుంపల శివరామ్ప్రసాద్, ఎస్వీ రమణమూర్తి, బలివాడ ధనుంజయరావు, ఎంవీ రమ ణ, గురుబెల్లి దామోదరరావు, సూర పాపారావు, తదితరులు ఆరోపించారు. కుప్పిలిలో డీబారైన విద్యార్థులు, తల్లిదండ్రులు, సస్పెండైన టీచర్లు సైతం ఈ ర్యాలీలో పాల్గొన్నారు. విద్యార్థుల డీబార్లను రద్దు చేసి, వారికి న్యాయం చేయాలని కోరారు. కలెక్టర్, మంత్రి అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్లను కలిసి విషయాన్ని తెలియజేశామని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నేతలు బొడ్డేపల్లి గోపీచంద్, రమణ, బి.భాస్కరరావు, సూర స్వర్ణకుమారి, బి.వెంకటేశ్వరరావు, శ్రీరామ్మూర్తి, దామోదరరావు, ఎంవీ రమణ, ఎం.సాంబమూర్తి, తంగి రాజారావు, శ్రీనివాసరావు, పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే మార్చి 26 సాయంత్రం 4 గంటలకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ఉపాధ్యాయులతో భారీ ధర్నా నిర్వహించనున్నారు. 27 సాయంత్రం 4 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నారు, అలాగే మార్చి 29న సాయంత్రం 4 గంటలకు డీఈఓ కార్యాలయం ముట్టడి, ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను బహిష్కరిస్తామని పేర్కొన్నారు.
కుప్పిలి మాస్ కాపీయింగ్ ఘటన
జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయుల భారీ ర్యాలీ
టీచర్ల సస్పెన్షన్లు రద్దు చేయాలని డిమాండ్