విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో 1990లో చదువుకున్న విద్యార్థులంతా, మూడున్నర దశాబ్ధాల తర్వాత మరలా మెడికల్ కళాశాలలో కలుసుకొని గత స్మృతులను ఒకరితో ఒకరు పంచుకున్నారు. నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ గూడేన సోమేశ్వరరావు, డాక్టర్ హర్షవల్లి నేతృత్వంలో మా ఊరికి రండి పేరిట పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక కార్యక్రమం వైభవంగా జరిగింది. రోజంతా ఆనందోత్సహాల నడుమ గడిపిన వైద్యులంతా, ప్రజలకు మరింత వైద్య సేవలు అందజేసేందుకు వినూత్న ఆలోచనలు చేశారు. వైద్యరంగంలో ప్రజా ఆరోగ్య సమస్యలను రూపుమాపేందుకు ప్రతిజ్ఞ చేశారు. –శ్రీకాకుళం అర్బన్