కొత్తూరు అతలాకుతలం
విద్యుత్ తీగ నుంచి మంటలు
స్థానిక ఆదిఆంధ్ర వీధిలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత కురిసిన వానకు విద్యుత్ తీగ తెగి పడిపోయింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. సోమవారం ఉదయం 6గంటలు సమయంలో కరెంటు రావడంతో ఒక్కసారిగా ఆ విద్యుత్ వైరు నుంచి మంటలు చెలరేగాయి. దీంతో విద్యుత్ వైరు పడిన భాగంలో ఉన్న కాగితాలు, కవర్లు మంటకు అంటుకున్నాయి. ఎవరైనా అటువైపుగా వెళ్లి ఉంటే పెను ప్రమాదమే జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. అనంతరం సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు విద్యుత్ లైన్లు సరిచేశారు. –టెక్కలి రూరల్
అరసవల్లి: ఆదివారం అర్ధరాత్రి దాటాక ఉరుముల వాన జిల్లాకేంద్రంపై విరుచుకుపడింది. భారీ గాలు లు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో బీభత్సం సృష్టించింది. ఈ వాన దెబ్బకు జిల్లా కేంద్రం అంతా చీకటిగా మారిపోయింది. గాలుల తీవ్రత అధికంగా ఉండడంతో పలు చోట్ల భారీ చెట్లు, కొమ్మలు పడిపోవడంతో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పిడుగుల ధాటికి పదుల సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్లు కూలిపోయాయి. దీంతో సోమవారం జిల్లా కేంద్రం సరిహద్దుల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు చోట్ల రహదారులన్నీ స్తంభించిపోయాయి. జిల్లాలో టెక్కలి, పలాస డివిజన్లలో ఈ వర్షం ప్రభావం పెద్దగా లేకపోవడంతో తీర ప్రాంతాల్లో పెద్ద ప్రభావం చూపలేదు. అయితే స్థానిక డివిజన్లో మాత్రం విద్యుత్ శాఖకు పెద్ద నష్టమే మిగిల్చి ంది. ప్రధానంగా జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్, ఇల్లిసిపురం, ఏఎస్ఎన్ కాలనీ, బొందిలీ పురం, పాలకొండ రోడ్డు, బలగ కూడలి, ఆసుపత్రి జంక్షన్, కత్తెర వీధి ఫీడర్ తదితర నగర ప్రాంతాలతో పాటు శ్రీకాకుళం రూరల్ గ్రామాల్లో కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఆయా ప్రాంతాల్లో సుమారు 30 వరకు విద్యుత్ స్తంభాలు కూలిపోగా, పిడుగులు పడి సుమారు 16 ట్రాన్స్ఫార్మర్లు పాడయ్యాయి. దీంతో పాటు భారీ వృక్షాలు నేలకూలిపోవడంతో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. ఫలితంగా విద్యుత్ శాఖకు రూ.35లక్షలు నుంచి రూ.40 లక్షల వరకు నష్టం వచ్చిందని అంచనా వేసినట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, ఈఈ పైడి యోగేశ్వరరావు, టెక్నికల్ ఈఈ సురేష్కుమార్లు తెలియజేశారు.
శరవేగంగా పునరుద్ధరణ
అకాల వర్షాలకు శ్రీకాకుళం డివిజన్లో ప్రధానంగా జిల్లా కేంద్రంలోనే అత్యధిక ప్రభావం కనిపించింది. పిడుగుల ధాటికి ట్రాన్స్ఫార్మర్లు కూలిపోవడంతో పాటు ధ్వంసం కావడంతో విద్యుత్ సరఫరాకు బ్రేక్ పడింది. అలాగే గాలుల కారణంగా ఫ్లెక్సీలు విద్యుత్ వైర్లపై పడటంతో కూడా విద్యుత్ సరఫరా కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో సోమ వారం వేకువజాము నుంచే విద్యుత్ శాఖ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి ఆదేశాల మేరకు టెక్నికల్ ఈఈ సురేష్, ఆపరేషన్స్ ఈఈ పైడి యోగేశ్వరరావులు యుద్ధప్రాతిపదికన క్షేత్ర స్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. కాంట్రాక్టర్ ఉంగటి పాపారావు బృందంతో కలిసి ఇల్లిసిపురం, బొందిలీపురంలో పునరుద్ధరణ పనులు చేపట్టారు. దీంతో సోమవారం సాయంత్రానికి దాదాపుగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అయితే ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతంలో మాత్రం సోమవారం రోజంతా విద్యుత్ సరఫరా జరగలేదు. రోజంతా కాంప్లెక్స్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అకాల వర్షాలు అన్నదాతకు అపార నష్టం కలిగించాయి. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వాన పడడంతో కొత్తూరు, కర్లెమ్మ, బడిగాం, మహసింగి, సిరుసువాడ, కుంటిభద్ర, నివగాం, మెట్టూరు గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో సాగు చేస్తున్న వందలాది ఎకరాల అరటి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. గాలులకు నష్టపోయిన పంటలకు ప్రభు త్వం నష్ట పరిహారం చెల్లించాలని బాధిత రైతు లు తోకల ధర్మారావు, భాస్కరరావు, పెద్దకోట ఆనందరావుతో పాటు పలువురు కోరుతున్నా రు. ఈదురు గాలులకు మండలంలో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు గ్రామాల్లో చెట్లు విరిగి పడిపోయాయి. – కొత్తూరు
కోలుకోలేని నష్టం
చేతికి అందిన అరటి పంట ఈదురుగాలులకు నేలమట్టమైంది. ఎకరాకు సుమారు రూ. 75 వేల వరకు పెట్టుబడి పెట్టాము. ఏడాది పాటు కష్టపడి సాగు చేసిన అరటి పంట గాలులకు నేలకొరిగిపోయింది. ఎకరాకు సుమారు రూ. 2 లక్షలు వరకు నష్టపోయాం. మమ్మల్ని ఆదుకోవాలి.
– పెద్దకోట ఆనందరావు, అరటి రైతు, కొత్తూరు
జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి భారీ వాన
శ్రీకాకుళం, రూరల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలుపుదల
తెగిపడిన విద్యుత్ వైర్లు, కూలిన ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు
రూ.40 లక్షల వరకు విద్యుత్ శాఖకు
నష్టమని అంచనా
నిశిరాత్రి విధ్వంసం
నిశిరాత్రి విధ్వంసం
నిశిరాత్రి విధ్వంసం
నిశిరాత్రి విధ్వంసం
నిశిరాత్రి విధ్వంసం
నిశిరాత్రి విధ్వంసం
నిశిరాత్రి విధ్వంసం