జిల్లా బేస్‌బాల్‌ సంఘ నూతన కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

జిల్లా బేస్‌బాల్‌ సంఘ నూతన కార్యవర్గం ఎన్నిక

Mar 24 2025 6:44 AM | Updated on Mar 24 2025 11:28 AM

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా బేస్‌బాల్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడిగా గుంటముక్కల వీరభద్రరావు, ప్రధాన కార్యదర్శిగా వాసుపల్లి రాంబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీకాకుళంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం సంఘ కార్యనిర్వాహక కార్యదర్శి కె.రవికుమార్‌ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సీనియర్‌ అడ్వకేట్‌ మొదలవలస రాజేంద్రకుమార్‌ పర్యవేక్షణలో జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎం.సాంబమూర్తి, డీఎస్‌డీఓ డాక్టర్‌ కె.శ్రీధర్‌రావు, రాష్ట్ర బేస్‌బాల్‌ సంఘ పరిశీలకులు సీహెచ్‌ రాజేష్‌ ఎన్నికల ప్రక్రియను పూర్తిచేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ ప్రతినిధులు మాట్లాడుతు జిల్లాలో బేస్‌బాల్‌ అసోసియేషన్‌ను ఏకతాటిపై ముందుకు తీసుకెళ్తామని.. గేమ్‌ అభివృద్ధికి, క్రీడాకారుల ఎదుగుదలకు పాటుపడతామన్నారు. అంతకుముందు జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయస్థాయి బేస్‌బాల్‌ పోటీల్లో రాణించిన క్రీడాకారులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఒలింపిక్‌ సంఘ జిల్లా సీఈఓ పి.సుందరరావు, బి.విజయ్‌కుమార్‌, వై.పోలినాయుడు, సాధు శ్రీనివాస్‌, ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ బి.వి.రమణ, సీహెచ్‌ జగదీష్‌, నిర్మల్‌కృష్ణ, కె.మాధవరావు, సతీష్‌రాయుడు, పేడాడ బాబూరావు, ఈశ్వరరావు, వెంకటరమణ, పీడీలు, పీఈటీలు, మాజీ, తాజా సంఘ ప్రతినిధులు, సీనియర్‌ క్రీడాకారులు పాల్గొన్నారు.

నూతన కార్యవర్గమిదే..

జిల్లా బేస్‌బాల్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడిగా కిల్లంశెట్టి అరుణ్‌కుమార్‌ గుప్తా, జిల్లా అధ్యక్షుడిగా గుంటముక్కల వీరభద్రరావు, ప్రధాన కార్యదర్శిగా వాసుపల్లి రాంబాబు, కోశాధికారిగా చీకటి మూర్తి, కార్యనిర్వాహక కార్యదర్శిగా కొండపల్లి రవికుమార్‌, సంఘ సహధ్యక్షులుగా డి.రామాంజనేయులు, లకిలి రాంబాబు, నిమ్మాన విజయమ్మ, సంయుక్త కార్యదర్శులుగా తోటాడ శ్రీను, అంధవరపు సంతోష్‌కుమార్‌, ఇప్పిలి అరుణ్‌కుమార్‌, కార్యవర్గ సభ్యులగా వి.గురుమూర్తి, కె.రమేష్‌, ఐ.సాయికిరణ్‌, ఐ.గౌరీశంకర్‌, డి.రాజేష్‌, ఎం.మధు, కుమారస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement