● దిక్కుతోచని స్థితిలో ముగ్గురు బాలికలు ● సాయం చేయాలని వేడుకోలు
కాశీబుగ్గ : ఆ ముగ్గురు చిన్నారులు రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయారు. అదే ప్రమాదంలో తల్లి తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలైంది. ఇప్పుడు ఆ చిన్నారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తమకు దాతలు సాయం అందించాలని వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని సూదికొండ ప్రాంతంలో బుట్ట గంగాధర్, సరళ దంపతులు ముగ్గురు కుమార్తెలతో నివాసం ఉండేవారు. గంగాధర్ దివ్యాంగుడు. నిరుపేద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. చిన్న ఇల్లు తప్ప వేరే ఆస్తులు లేవు. పదిరోజుల క్రితం ఒడిశా రాష్ట్రం గండహతి ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు లోయలో పడిపోయారు. గంగాధర్ అక్కడికక్కడే మృతి చెందగా భార్య సరళకు కాలు, నడుము విరిగిపోయాయి. ఆస్పత్రిలో దిక్కుతోచని స్థితిలో ఉంది. వారి సంతానమైన ముగ్గురు బాలికలు అనాథలుగా మిగిలిపోయారు. దాతలు స్పందించి చిన్నారులకు చేదోడుగా నిలబడాలని అమ్మమ్మ జి.గౌరీ(8374708027) వేడుకుంటోంది.
తండ్రిని కోల్పోయి.. తల్లి ఆస్పత్రి పాలై..