ఎచ్చెర్ల: యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఎచ్చెర్లలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా గ్రామీణ యువత కోసం సీసీ కెమెరా ఇన్స్టాలేషన్, సర్వీసింగ్లో 13 రోజుల ఉచిత శిక్షణను ఈ నెల 28 నుంచి ప్రారంభించనున్నట్లు సంస్థ డైరెక్టర్ కల్లూరి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణా కాలంలో ఉచిత భోజన, వసతి సౌకర్యాలను కల్పిస్తామని, పూర్తి వివరాలకు 9553410809, 7993340407 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
టీడీపీ నేతపై చర్యలు తీసుకోవాలి
అరసవల్లి: పెద్దపాడు సమీపంలో ఈ నెల 12న విధి నిర్వహణలో ఉన్న విద్యుత్ సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ నారాయణరావుపై దాడికి పాల్పడిన స్థానిక టీడీపీ నేత కలగ శ్రీనివాసరావుపై ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని.. ఇంకో మూడు రోజుల్లో దీనిపై తేల్చకపోతే భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతామని విద్యుత్ కార్మిక సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ మేరకు విద్యుత్ శాఖ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తిని మంగళవారం పలువురు కార్మిక ఉద్యోగ సంఘ నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. దాడి చేయడమే కాకుండా మిగిలిన వారిపై పరుష పదజాలంతో దూషించినా పోలీసులు ఇంతవరకు చర్యలు చేపట్టలేదన్నారు. ఇలాగైతే విధులు నిర్వర్తించడం కష్టమని స్పష్టం చేశారు. ఇప్పటికై నా ఎస్ఈ తదితర ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఎస్ఈని కలిసిన వారిలో ఎం.ప్రభాకరరావు, టి.వి.సుబ్రహ్మణ్యం (1104), కె.వైకుంఠం (తెలుగునాడు), సీహెచ్ పాపారావు (327), బి.గురునాథరావు (బహుజన) , విద్యుత్ కార్మిక యూనియన్ నేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆన్లైన్ ఖాతాల నిర్వహణపై శిక్షణ
ఎచ్చెర్ల క్యాంపస్: స్వయం సహాయక సంఘాల ఖాతాల నిర్వహణ ఆన్లైన్ చేయాలని వెలుగు సంస్థ సంస్థాగత నిర్మాణం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ మోహన్రావు అన్నారు. ఎచ్చెర్లలోని జిల్లా సాంకేతిక శిక్షణ కేంద్రంలో కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, నందిగాం, కొత్తూరు, ఎల్ఎన్పేట, సరుబుజ్జిలి మండలాల ఏసీ, ఎల్ఎస్, ఏపీఎం, సీసీ, వీవోఏలకు లోకోస్ సాఫ్ట్వేర్, ఆన్లైన్ ఖాతాల నిర్వహణపై మంగళవారం శిక్షణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ మార్గదర్శకాలను అనుగుణంగా స్వయం సహాయ సంఘాలు విజయవంతంగా ముందుకు సాగాలన్నారు. గ్రామైక్య, మండల సమాఖ్య, జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో ఖాతాల నిర్వహణ పక్కాగా ఉండాలని చెప్పారు. రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎం భాగ్యలత, అధికారులు పాల్గొన్నారు.
అంగన్వాడీ కేంద్రాల వేళల్లో మార్పు
శ్రీకాకుళం అర్బన్ : వేసవి దృష్ట్యా జిల్లా లోని అంగన్వాడీ కేంద్రాల సమయవేళల్లో మార్పులు చేస్తున్నట్లు జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శాంతిశ్రీ మంగళవారం తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కేంద్రాలు పనిచేస్తాయని పేర్కొన్నారు. మే 31వ తేదీ వరకూ ఈ వేళలు అమల్లో ఉంటాయన్నారు. ప్రీ స్కూల్ చిన్నారులకు వండిన ఆహారం అందించి వారి గృహాలకు పంపించాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు, ఆయాలు గమనించాలని కోరారు.
ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ