
బాధ్యతగా విధులు నిర్వహించండి
● జెడ్పీ చైర్పర్సన్ విజయ
అరసవల్లి: జిల్లా పరిషత్ యాజమాన్యంలో కారుణ్య నియామకాలను పూర్తి పారదర్శకంగా చేపడుతున్నామని, ఉద్యోగాలు పొందినవారు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ సూచించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బంగ్లాలో కారుణ్య నియామకాల కింద పాలక దమయంతి (సరుబుజ్జిలి ఎంపీపీ ఆఫీస్ సబార్డినేట్), మక్క అప్పలనాయుడు (జెడ్పీ ఆఫీస్ సబార్డినేట్), లండ కోటేశ్వరరావు (కొలిగాం జెడ్పీ స్కూల్ ఆఫీస్ సబార్డినేట్) లకు నియామకపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో ఎల్ఎన్వీ శ్రీధర్ రాజా, సీ సెక్షన్ సూపరింటెండెంట్ రమేష్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
పాతపట్నం: మండలంలోని ద్వారాకాపురం వద్ద పాతపట్నం–టెక్కలి రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని లాబర గ్రామానికి చెందిన సనపల మధు(22) బుధవారం సాయంత్రం సారవకోట మండలం కరడసింగి గ్రామంలోని తన చెల్లెలు ఇంటికి వెళ్లాడు. అనంతరం తన బావ మండల శివ, మేనల్లుడు (రెండు సంవత్సరాల)తో కలిసి ద్విచక్ర వాహనంపై లాబర బయల్దేరారు. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై సారవకోట మండలం జమచక్రంకు చెందిన పంతులు గోపి వస్తున్నాడు. ద్వారకాపురం వద్ద ఈ రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఘటనలో సనపల మధు అక్కడిక్కడే మృతి చెందగా, పంతులు గోపి, మండల శివకు తీవ్రగాయాలయ్యాయి. రెండేళ్ల బాబుకి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి ఎస్ఐ బి.లావణ్య చేరుకున్నారు. గోపిని టెక్కలి జిల్లా ఆస్పత్రికి అంబులెన్స్లో, మండల శివ, బాలుడిని పాతపట్నం సీహెచ్సీకి ఎస్ఐ జీపులో తరలించారు. మృతుడు మధుకి తండ్రి సనపల కృష్ణారావు, తల్లి సనపల సావిత్రిలు ఉన్నారు. వచ్చే నెల ఏప్రిల్ 16న పెళ్లి చేయాలని ముహూర్తం పెట్టుకున్నామని విలపిస్తున్నారు.

బాధ్యతగా విధులు నిర్వహించండి