టాక్షోలో శివానీ కళాశాల విద్యార్థినుల ఉత్సాహం
చుట్టూ మృగాళ్లు, ఒక్క తప్పటడుగు పడినా అమాంతం లాగేసే క్రూర వేటగాళ్లు.. వీధి చివర, బస్టాండుల్లో, కూడళ్లలో వేధించే ఆకతాయిలు.. ఇవి చాలవన్నట్టు ఆన్లైన్లోనూ అనుక్షణం పీడించుకుని తినే సైబరాసురులు.. ఇందరి మధ్య ఓ అబల స్వేచ్ఛగా బతకడం నిత్య యుద్ధమే. మహిళా దినోత్సవం సందర్భంగా చిలకపాలెంలోని శ్రీ శివానీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ‘సాక్షి’ మహిళల భద్రత, సోషల్ మీడియా ప్రభావంపై చర్చా వేదిక నిర్వహించింది. ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రాజ్కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమ్మాయిలు, మహిళలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం /
ఎచ్చెర్ల క్యాంపస్ / టెక్కలి /
పాత బస్టాండ్ / కాశీబుగ్గ/ శ్రీకాకుళం క్రైం
నియంత్రించుకోవాలి..
వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియాలో పంచుకోకూడదు. చిన్న తప్పు చేసినా అదే మనల్ని వేధిస్తుంది. మన లిమిట్స్ లో మనం ఉండాలి.
– పొన్నాడ దీపిక, విద్యార్థిని
వస్త్రధారణా కీలకమే..
మహిళల వస్త్రధారణపై చాలా డిబేట్లు జరుగుతున్నాయి. మగవారిని ఆకర్షించే వస్త్రధారణ ఎప్పుడూ మంచిది కాదు.
– బాలక రమ్యశ్రీ, విద్యార్థిని
విలువలు ముఖ్యం
చెడు స్నేహాలకు దూరంగా ఉంటే మేలు. ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. విలువలు పాటించాలి.
– ఆర్.స్వాతి, విద్యార్థిని
●
No Headline
No Headline
No Headline
No Headline