శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ఇంటర్మీడియె ట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఐదో రోజు గురువారం ఫస్టియర్ విద్యార్థులు సెట్–2 ప్రశ్న పత్రంతో మ్యాథ్స్ 1ఎ, బోటనీ, సివిక్స్ పేపర్–1, ఇతర ఒకేషనల్ పేపర్ల పరీక్ష రాశారు. జనరల్, ఒకేషనల్ రెండు విభాగాల్లో కలిపి 22,498 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 21,683 మంది పరీక్ష రాశారు. వివిధ కారణాలతో రికార్డుస్థాయిలో 815 మంది గైర్హాజరయ్యారు. ఎలాంటి మాల్ ప్రాక్టీసు కేసులు నమోదుకాలేదని ఆర్ఐఓ ప్రగడ దుర్గారావు ధ్రువీకరించారు.