కాశీబుగ్గ: పలాస మండలం బొడ్డపాడు పంచాయతీ కేంద్రంలో ఉన్న తెప్పల గారమ్మ ఒక్క యూనిట్ విద్యుత్ వాడకపోయినా రూ.290 బిల్లు వేశారు. గురువారం సాయంత్రం ఆమె ఇంటికి కరెంటు బిల్లు వచ్చింది. ఆమె అనారోగ్యం కారణంగా వేరే వారి ఇంటిలో ఉంటున్నారు. ఈ ఇంటిలో కనీసం ఒక్క రోజు కూడా కరెంటు వాడలేదు. ఒక్క యూనిట్ కరెంటు వాడకపోయినా చార్జీ రూ.237, షార్ట్ ఫాల్ బిల్, కస్టమ్ చార్జ్ రూ.25, ఫిక్స్డ్ చార్జ్ రూ.10, ఎఫ్పీపీసీఏ3 చార్జ్ పేరుతో రూ.9.5 అంటూ మొత్తం రూ.290.47 బిల్లు వచ్చింది. దీంతో ఆమె నిశ్చేష్టురాలయ్యారు.
ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళన
బూర్జ: మండలంలో గల లక్కుపురం గ్రామంలో ఖరీఫ్లో పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ధాన్యం బస్తాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. గురువారం రైతులు వి య్యపు భాగ్యారావు, వారాడ రామినాయుడు, వియ్యపు దుర్గారావు, వాకముడ్లు పెంటయ్య, శేషపు తవిటినాయుడు, పొదిలాపు ధర్మారావు తదితరులు పొలంలో ధాన్యం బస్తాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో 20 శాతం మాత్రమే ధాన్యం అమ్మకాలు జరిగాయని, ఇంకా గ్రా మంలో రైతుల వద్ద సుమారు 80 శాతం వరకు ధాన్యం నిల్వలు ఉన్నాయని వారు తెలియజేశారు. ఇదివరకు జేసీ హామీ ఇచ్చినా పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని అన్నారు. తక్షణమే న్యాయం చేయాలని కోరారు.
8 నుంచి పి–4 సర్వే
శ్రీకాకుళం పాతబస్టాండ్: పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్నర్షిప్ (పి 4) సర్వేకు కార్యాచరణ రూపొందించిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ సర్వే కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ను ఉపయోగించి ఈ నెల 8వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే ప్రా రంభించి 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ఈ సర్వే పై మార్చి 6, 7 తేదీల్లో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. పేదల అవసరాలను గుర్తించి వారి సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టుల రూపకల్పనకు ఈ సర్వే దోహ దపడుతుందని, ప్రస్తుతం కుటుంబాలు అందుకుంటున్న పథకాలపై ఈ సర్వే ఎలాంటి ప్రభావం చూపబోదని, సర్వే ద్వారా సేకరించిన డేటా ఆధారంగా కుటుంబ అవసరాలకు అనుగుణంగా సమర్థమైన ప్రణాళికలు రూపొందించవచ్చన్నారు.
కరెంటే వాడలేదు బిల్లు మాత్రం రూ.290
కరెంటే వాడలేదు బిల్లు మాత్రం రూ.290