ఇప్పుడు బాదుడా? | - | Sakshi
Sakshi News home page

ఇప్పుడు బాదుడా?

Mar 7 2025 9:18 AM | Updated on Mar 7 2025 9:15 AM

అప్పుడు వదిలేసి..

రూ.3వేలు అదనం..

గత ఏడాది రూ.1.02 లక్షలు అప్పు చూపిస్తే ఆ మొత్తానికి వడ్డీ జమ చేసి రెన్యూవల్‌ చేయించుకున్నాను. ఈ ఏడాది అప్ప ఖాతా రూ. 1.05 లక్షలకు పెంచిచూపించారు. ఆ మొత్తానికి వడ్డీ చెల్లించి రెన్యూవల్‌ చేసుకోవాలని సిబ్బంది చెబుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే కరోనా సమయంలో 2020లో బ్యాంకు సిబ్బంది వడ్డీ వసూలు చేసేందుకు రాలేదని, ఇప్పుడు ఆ మొత్తం కలిపేశామని చెబుతున్నారు.

– తమ్మినేని శ్రీనివాసరావు, రైతు, కట్యాచార్యులపేట

రసీదులు ఇవ్వడం లేదు..

అప్పు, వడ్డీ చెల్లింపులు చేస్తున్నప్పుడు రైతులకు ఎటువంటి రసీదులు ఇవ్వడంలేదు. ఖాళీ ఓచర్లపై సంతకాలు చేయించుకుంటున్నారు. అసలుకు ఎసరు పెడుతూ అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు. లక్షల్లో అప్పులు వాడిన ప్రతి రైతుకు 4 శాతం మొత్తం రుణ ఖాతాకు కలిపారు. ఉన్నతాధికారులు పరిశీలించి రైతులకు న్యాయం చేయాలి. – పేడాడ భానూజీరావు,

కొర్లకోట, ఆమదాలవలస మండలం

ఆమదాలవలస: పట్టణంలోని కృష్ణాపురం వ్యవసాయ పరపతి సంఘం(పీఎసీఎస్‌) కార్యాలయంలో వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులు వడ్డీ బాదుడుపై లబోదిబోమంటున్నారు. గతంలో వాడిన అప్పు మొత్తాలకంటే ఎక్కువ చూపిస్తూ ఇప్పుడు వడ్డీలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒక్కో రైతుకు రూ.లక్షకు రూ. 3వేలు నుంచి రూ.4 వేలు వరకు అధికంగా కలిపిజాబితా చూపిస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. ఇదేంటని సిబ్బందిని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని వాపోతున్నారు.

భారీగా తేడాలు..

కృష్ణాపురం పీఏసీఎస్‌ పరిధిలో ఆమదాలవలస మండలం, మున్సిపాలిటీకి సంబంధించి 2796 మంది రైతులు రుణాలు వాడారు. ఆయా రైతుల పేరిట రూ.15,77,7,642 అప్పు ఉన్నట్లు చూపిస్తున్నారు. ఇంతవరకు రెన్యూవల్స్‌ చేసి వడ్డీలు చెల్లించిన సుమారు 400 మంది రైతుల నుంచి రూ.1.50 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. 2019–20 సంవత్సరంలో కరోన సమయంలో రైతులు వడ్డీలు చెల్లించలేదని, దీంతో ఆ మొత్తాలు ఇప్పుడు ఖాతాలకు జమచేసినట్లు చెబుతున్నారు. నాలుగేళ్లు పాటు వదిలేసి ఈ ఏడాది మాత్రమే అదనంగా కలపడంపై రైతులు మండిపడుతున్నారు. మరోవైపు గతంలో రాష్ట్ర ప్రభుత్వం 4శాతం వడ్డీ రాయితీ, కేంద్ర ప్రభుత్వం 3 శాతం వడ్డీరాయితీ ఇవ్వకపోవడంతో ఆ మొత్తం కోపరేటివ్‌ బ్యాంకు ద్వారా రైతుల ఖాతాలకు జమచేసినట్లు సిబ్బంది చెబుతున్నారు. అదే విధంగా, కృష్ణాపురం పీఎసీఎస్‌ అప్పు మొత్తాలకు, కో ఆపరేటిట్‌ బ్యాంకుకు పీఏసీఎస్‌ చెల్లించాల్సిన మొత్లాకు సుమారు రూ.3 కోట్లు తేడా చూపిస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తాలను కూడా ఎక్కడ తమకే విధిస్తారోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. పీఏసీఎస్‌ పరిధిలో వడ్డీలు, రుణాలు చెల్లిస్తున్న రైతులకు ఎటువంటి రసీసులు ఇవ్వకుండా ఖాళీ ఓచర్లపై సంతకాలు పెట్టిస్తూ పంపిస్తున్నారని, ఇలాంటి చర్యలు మోసగించడానికేనని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర దర్యాప్తు చేపట్టి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

కృష్ణాపురం పీఏసీఎస్‌ పరిధిలో రైతుల ఖాతాల్లో అప్పు మొత్తాల పెంపు

కరోనా సమయం నాటి వడ్డీ అంటూ పొంతనలేని సమాధానాలు

ఆందోళనలో రైతులు

బ్యాంకు జాబితా మేరకే..

బ్యాంకుల నుంచి మాకు వచ్చిన జాబితా ప్రకారం రైతుల నుంచి వడ్డీలు వసూలు చేస్తున్నాం. అప్పు మొత్తాలకు ప్రతి రైతు ఖాతాకు 4 శాతం మొత్తం చేసి లక్ష రూపాయలకు రూ.4000 చొప్పున కలిపి జాబితాలో వచ్చింది. 2020లో కరోనా సమయంలో ఇక్కడ సిబ్బంది వడ్డీలు వసూలు చేయలేదు. ఆ మొత్తాలను 2024లో రైతుల ఖాతాలకు కలిపినట్లు ఉన్నతాధికారులు రైతులకు చెప్పమన్నారు.

–చిగురుపల్లి వెంకటరావు, కృష్ణాపురం పీఏసీఎస్‌ సీఈఓ

ఇప్పుడు బాదుడా? 1
1/4

ఇప్పుడు బాదుడా?

ఇప్పుడు బాదుడా? 2
2/4

ఇప్పుడు బాదుడా?

ఇప్పుడు బాదుడా? 3
3/4

ఇప్పుడు బాదుడా?

ఇప్పుడు బాదుడా? 4
4/4

ఇప్పుడు బాదుడా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement