ట్రాక్టర్‌ బోల్తా పడి డ్రైవర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ బోల్తా పడి డ్రైవర్‌ మృతి

May 9 2026 7:20 AM | Updated on May 9 2026 7:20 AM

సంగం: కంకర లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి చెరువులో బోల్తాపడి డ్రైవర్‌ మృతిచెందిన ఘటన శుక్రవారం మండలంలోని వంగల్లు గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తిరువీధిపాడు గ్రామం నుంచి సంగం వైపు కంకర లోడుతో ట్రాక్టర్‌ వెళ్తోంది. ఈ క్రమంలో అదుపుతప్పి చెరువులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ కాశీపాళేనికి చెందిన షేక్‌ సుభాని (48) మృతిచెందాడు. సమాచారం అందుకున్న సంగం ఎస్సై రాజేష్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement