టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ మా భవిష్యత్ గురించి ఆలోచన చేయలేదు. వైఎస్ జగన్ ఐదేళ్లు అధికారంలో ఉంటే.. అందరితోపాటు సమానంగా సంక్షేమ పథకాలు, మా మహిళలకు పొదుపు రుణాల మాఫీ, మా బిడ్డలకు అమ్మఒడి, ఫీజురీయింబర్స్మెంట్, మాకు వేట నిషేధ సమయంలో ఏటా రూ.10 వేలు లెక్కన ఠంచన్గా అందించారు. చంద్రబాబు రూ.20 వేలిస్తామని చెప్పినా.. సగం మందికి కూడా రావడం లేదు. ఈ సమస్యలన్నీ జగన్కు వివరించి పరిష్కారం కోరాలని మత్స్యకారులందరూ ఎదురు చూస్తున్నారు.
– వాయిల శ్యామ్, మార్కండేయపురం, తుమ్మలపెంట పంచాయతీ
●


