
క్రస్ట్గేట్ల మరమ్మతుల్లో తీవ్ర జాప్యం
సోమశిల: జిల్లా జలనిధి సోమశిల జలాశయం క్రస్ట్గేట్ల మరమ్మతుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జలాశయ 11, 12 క్రస్ట్ గేట్ల రోప్లు పూర్తిస్థాయిలో దెబ్బతినడంతో వాటికి మరమ్మతుల కోసం దాదాపు 20 రోజుల క్రితం నూతన రోప్లను ప్రాజెక్టు వద్దకు చేర్చారు. అయితే వాటిని అక్కడ నిరుపయోగంగా పడేశారు. ఈ క్రమంలో 4, 6 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని డెల్టాకు విడుదల చేయడంతో ఆప్రాన్ మీదుగా వాహనాలు అనుమతించకపోవడంతో సోమశిల, రాజుపాళెం, కమ్మవారిపల్లి, కలువాయి, పీకేపాడు గ్రామాలకు రాకపోకలు సాగించేందుకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు సుదూరం తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సంబంధిత జలాశయం అధికారులు నిర్లక్ష్యం వీడి వెంటనే క్రస్ట్ గేట్లకు కొత్త రోప్లు ఏర్పాటు చేసే పనులు చేపట్టాలని స్థానిక గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.