ప్రభుత్వ భూమిలో కలప నరికివేత | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూమిలో కలప నరికివేత

May 6 2025 12:07 AM | Updated on May 6 2025 12:07 AM

ప్రభుత్వ భూమిలో కలప నరికివేత

ప్రభుత్వ భూమిలో కలప నరికివేత

దుత్తలూరు: మండల పరిధిలోని భైరవరం గ్రామంలో ప్రభుత్వ భూమిలో రెండు రోజులుగా అక్రమంగా కలప నరికి అమ్ముకుంటున్నారు. గ్రామస్తులు అధికారులకు తెలియజేసినా పట్టించుకోకపోవడంతో సోమవారం తహసీల్దార్‌ యనమల నాగరాజుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకుల అండతో ఓ వ్యక్తి సర్వే నంబర్‌ 168 – 1ఏలో కలపను నరికించి ఇతరులకు అమ్ముతున్నట్లు ఆరోపించారు. దీనిని అడ్డుకోవాలని కోరారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. వీఆర్వో మాల్యాద్రిని వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కలప నరికివేతను ఆపేస్తామని, రికార్డులు పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement