
జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ టోర్నమెంట్ ప్రారంభం
వెంకటాచలం: మండలంలోని కాకుటూరు వద్దనున్న విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్యూ)లో జాతీయ స్థాయి పురుషుల సాఫ్ట్బాల్ టోర్నమెంట్ను శాప్ చైర్మన్ రవినాయుడు, వర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు ఆదివారం ప్రారంభించారు. ఐదురోజులపాటు జరిగే ఈ టోర్నమెంట్కు దేశంలోని వివిధ యూనివర్సిటీల నుంచి 97 టీమ్లు విచ్చేశాయి. తొలిరోజున 30 మ్యాచ్లు జరిగాయి.
వివాహిత ఆత్మహత్య
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: మండలంలోని జొన్నవాడ గ్రామానికి చెందిన వెంకటరమణమ్మ (27) అనే వివాహిత కుటుంబ కలహాల నేపథ్యంలో ఆదివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటి చుట్టుపక్కలవారు గమనించి ఆమెను ఓ ప్రైవేట్ వాహనంలో నెల్లూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వెంకటరమణమ్మ మృతిచెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
నెల్లూరు పౌల్ట్రీ
అసోసియేషన్ ధరలు
బ్రాయిలర్ (లైవ్) : 132
లేయర్ (లైవ్) : 100
బ్రాయిలర్ చికెన్ : 234
బ్రాయిలర్ స్కిన్లెస్ : 258
లేయర్ చికెన్ : 170