
డివైడర్ను ఢీకొన్న కారు
● త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
● మహిళకు స్వల్ప గాయాలు
విడవలూరు(కొడవలూరు): కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం పక్కనే ఉన్న స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురిలో ఓ మహిళ స్వల్పంగా గాయపడింది. మిగిలిన వారు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన కొడవలూరు మండలంలోని రాచర్లపాడు వద్ద గురువారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. కావలిలో జరిగే వివాహానికి నెల్లూరు నుంచి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు బయలుదేరారు. రాచర్లపాడు వద్ద డ్రైవర్ కునుకు తీయడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన మహిళను హైవే మొబైల్ సిబ్బంది సహకారంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు.