ప్రజా సమస్యలపై పోరాటం | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలపై పోరాటం

May 1 2025 12:09 AM | Updated on May 1 2025 12:09 AM

ప్రజా

ప్రజా సమస్యలపై పోరాటం

నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి

సైదాపురం: ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వెంకటగిరిలోని ఎన్‌జేఆర్‌ భవనంలో బుధవారం డక్కిలి, బాలాయపల్లి, వెంకటగిరి మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకులకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. 2027లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని, వాటిల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టిస్తుందన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ సీఎం అవుతారన్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను నేతలకు వివరించారు.

ప్రజా సమస్యలపై పోరాటం1
1/1

ప్రజా సమస్యలపై పోరాటం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement