ధాన్యం కొనుగోళ్లపై చర్చ | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లపై చర్చ

Mar 19 2025 12:05 AM | Updated on Mar 19 2025 12:05 AM

ధాన్యం కొనుగోళ్లపై చర్చ

ధాన్యం కొనుగోళ్లపై చర్చ

మంత్రి నాదెండ్లతో

మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ

నెల్లూరు రూరల్‌: పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోని తన చాంబర్‌లో మంగళవారం సమావేశమయ్యారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించారు. మంత్రి నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 15 వేల టన్నుల పైగా ధాన్యం కొనుగోలు చేసామని తెలిపారు. ధాన్యం కొనుగోలు జరిగిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని తెలిపారు. రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు కొనసాగుతుందని, గన్నీ బ్యాగులు, ట్రాన్స్‌పోర్ట్‌ సౌకర్యాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. మిల్లర్స్‌తో చర్చించి ధాన్యం కొనుగోలు పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తేమ శాతం 17–20 ఉన్న ధాన్యాన్ని సైతం రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తామన్నారు. ఏఐ ద్వారా ధాన్యం అమ్మకం మరింత సులభతరం చేసేందుకు 7337359375 నెంబరుకు హాయ్‌ మెసేజ్‌ పంపితే రైతులు ధాన్యం అమ్మకం వివరాలు తెలుసుకోవచ్చనని వెల్లడించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ శాఖ మంత్రి పి నారాయణ, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి మహమ్మద్‌ ఫరూక్‌, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కె రామకృష్ణ, దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, పౌరసరఫరాల సంస్థ ఎండీ మన్సూర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement