యథేచ్ఛగా భూ ఆక్రమణ | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా భూ ఆక్రమణ

Sep 7 2024 12:14 AM | Updated on Sep 7 2024 12:14 AM

యథేచ్ఛగా భూ ఆక్రమణ

యథేచ్ఛగా భూ ఆక్రమణ

మర్రిపాడు: కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ పార్టీల నేతలు మండలంలోని పలు గ్రామాల్లో భూ ఆక్రమణలకు యథేచ్ఛగా పాల్పడుతున్నారు. ప్రభుత్వ భూమి కనిపిస్తే దాన్ని చదును చేయడం, ఆక్రమించడం, అనంతరం విక్రయించడం లాంటి కార్యక్రమాలకు తెరలేపుతున్నారు. డీసీపల్లి హైవేను ఆనుకొని ఉన్న పలు స్థలాల వెనుక తమ పట్టా భూమి ఉందంటూ దాన్ని సైతం ఆక్రమించి విక్రయించే పర్వానికి శ్రీకారం చుట్టారు. నందవరం గ్రామంలోని సర్వే నంబర్‌ 131 – 2, 416 / 1, 417 / 1లో ఉన్న ప్రభుత్వ భూములను సైతం ఇటీవల చదును చూసి ఆక్రమించేందుకు యత్నించారు. మరికొన్ని చోట్ల యంత్రాలను తీసుకొచ్చి రాత్రికి రాత్రే చదు ను చేస్తున్నారు. ఈ వ్యవహారం అధికారులకు తెలిసినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement