సామాజిక సేవలో భాగస్వాములు కావాలి | - | Sakshi
Sakshi News home page

సామాజిక సేవలో భాగస్వాములు కావాలి

Dec 6 2025 9:22 AM | Updated on Dec 6 2025 9:22 AM

సామాజిక సేవలో భాగస్వాములు కావాలి

సామాజిక సేవలో భాగస్వాములు కావాలి

మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ అనిత

గజ్వేల్‌రూరల్‌: విద్యార్థులు సమాజ సేవలో భాగస్వాములు కావాలని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ అనిత అబ్రహం పిలుపునిచ్చారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో కళాశాలలో శుక్రవారం అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి సహకారం అందించి ఆదుకోవాలన్నారు. క్రమశిక్షణ, ఐక్యత, నైతికత, బాధ్యతతో వ్యవహరించడం లాంటి విలువల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు స్వచ్ఛంద సేవ ప్రతిజ్ఞ చేశారు. కళాశాల పరిసరాలను పరిశుభ్రం చేశారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారులు డాక్టర్‌ సౌజన్య, డాక్టర్‌ సరోజ, అధ్యాపకులు కస్తూరిబాయి, వీఆర్‌ అర్చన, డాక్టర్‌ శోభారాణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement