
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కిష్టయ్య
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణం పరిష్కరించాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) జిల్లా అధ్యక్షుడు కిష్టయ్య అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో డీటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిష్టయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలుచేయాలన్నారు. మిగిలిన డీఏలను వెంటనే ప్రకటించాలన్నారు. ఉపాధ్యాయుల పక్షాన పోరాటంలో డీటీఎఫ్ ముందుంటుందన్నారు. కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా నాయకులు తిరుపతిరెడ్డి, మల్లయ్య, మనీష్ కుమార్, ప్రభాకర్రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు 42శాతం
రిజర్వేషన్లు కల్పించాలి
సిద్దిపేటకమాన్: స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారామ్ అన్నారు. సిద్దిపేట ప్రెస్క్లబ్లో జరిగిన సమావేశంలో యాదవుల ఆత్మగౌరవ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో యాదవులకు మంత్రి పదవి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్లుగా అనేక అవకాశాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 30న హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద జరగే యాదవుల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో కృష్ణ, రాము, నర్సింహులు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా స్థాయి
కిక్ బాక్సింగ్ పోటీలు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): పట్టణంలో జిల్లా స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు ఆదివారం జరిగాయి. పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులకు మెడల్స్, ప్రశంసా పత్రాలు అందించారు. విజేతలు ఈ నెల 28, 29 తేదీల్లో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో జరిగే రాష్ట్ర ఓపెన్ కిక్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీలలో పాల్గొననున్నట్లు నిర్వాహకులు తేజస్వీన్, ప్రవీణ్ తెలిపారు. పోటీలకు న్యాయ నిర్ణీతలుగా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆంజనేయులు, జనరల్ సెక్రటరీ భాగ్యరాజ్, ట్రెజరర్ స్వామి, జాయింట్ సెక్రటరీ పవన్ కల్యాణ్, క్రీడాకారులు పాల్గొన్నారు.
అసైన్డ్ భూములపై సర్వహక్కులు కల్పించాలి
అంబేడ్కర్, పూలే సేవాసమితి
రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ రహీం
నారాయణఖేడ్: రాష్ట్రంలో అసైన్డ్ భూములు కలిగి ఉన్న రైతులకు 1977 పీవోటీ చట్టాన్ని రద్దుచేసి భూములపై సర్వహక్కులు కల్పించాలని అంబేడ్కర్, పూలే సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ రహీం ప్రభుత్వాన్ని కోరారు. ఖేడ్లోని సంఘం కార్యాలయంలో శనివారం నిర్వహించిన సంఘం జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ...గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలలో మిగులు, ప్రభుత్వ భూములను భూమిలేని నిరుపేదలకు అసైన్డ్ చేశారన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అసైన్డ్ భూములను రైతుల నుంచి బలవంతంగా లాక్కుని పల్లె ప్రకృతివనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, క్రీడా ప్రాంగణాలకు కేటాయించి పేదరైతులకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పండరీ, సహాయ కార్యదర్శి గౌచ్చిస్తి, ఖేడ్ డివిజన్ అధ్యక్షుడు నర్సింహులు, ప్రధాన కార్యదర్శి వినోద్కుమార్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు యాదమ్మ పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి