
పచ్చని చెట్లపై గొడ్డలివేటు
అక్కన్నపేట(హుస్నాబాద్): నీడనిచ్చే పచ్చని చెట్లను యథేచ్ఛగా నరికివేస్తున్నారు. మండల పరిధిలోని కట్కూర్ గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఏపుగా పెరిగిన చట్లను నరికేశారు. ఐదారేళ్ల కిత్రం పంచాయతీ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటి మొక్కలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆదివారం ఓ రైతు సుమారు సుమారు 10చెట్లను నేలమట్టం చేశారు. ఈ రోడ్డు మార్గంగా వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ చెట్ల నీడన సేదతీరేవారు. చెట్ల నరికివేతతో ఇప్పుడా సౌకర్యం లేక ఆవేదన చెందుతున్నారు. పచ్చని చెట్లను నరికివేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెట్లను నరికివేసిన సదరు వ్యక్తికి జరిమానాతోపాటు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.