
చేనేతల సంక్షేమానికి చర్యలు చేపట్టాలి
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి
దుబ్బాక: చేనేతల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం దుబ్బాకలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి నీలకంఠ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులవృత్తికి ఆదరణ లేకపోవడంతో చేనేత కుటుంబాలు దుర్భరంగా కాలం వెళ్లదీస్తున్నాయని అన్నారు. చేనేత వృత్తిలో ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేతకు ప్రసిద్ధి గాంచిన దుబ్బాక ప్రాంతంలో నేడు 50 కుటుంబాలకు కూడా ఉపాధి దొరకని పరిస్థితి నెలకొందన్నారు. చేనేతల సంక్షేమం కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలన్నారు. నీలకంఠ సమాజం అభ్యున్నతికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో నీలకంఠ సంఘం అధ్యక్షుడు బోడ శ్రీహరి, కాల్వ రామస్వామి, వీరబత్తిని లింగం, దుబ్బరాజం, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తదితరులు ఉన్నారు.