
విద్యాధరి, నాచగిరిలో.. భక్తుల కిటకిట
వర్గల్ విద్యాసరస్వతి, నాచగిరి లక్ష్మీనృసింహక్షేత్రాలు ఆదివారం భక్తులతో కిటకిటలాడాయి. సరస్వతిమాత సన్నిధిలో పెద్దసంఖ్యలో చిన్నారుల అక్షరాభ్యాసాలు జరిగాయి. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ఆశీ స్సులు పొందారు. మరోవైపు నాచగిరి క్షేత్రంలో స్వాతి నక్షత్ర మహోత్సవ వేడుకలు జరిగాయి. సుదర్శన హోమం నిర్వహించారు. – వర్గల్(గజ్వేల్)
మల్లన్నకు పట్నాలు.. భక్తుల మొక్కులు
కొమురవెల్లి మల్లన్న కేత్రం ఆదివారం భక్తులతో సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలన్నీ మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. వేకువ జామునుంచే మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు బారులుతీరారు. దర్శనం అనంతరం గంగరేణి చెట్టు వద్ద పట్నాలు వేసి, ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఏర్పాట్లను ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు. – కొమురవెల్లి(సిద్దిపేట)

విద్యాధరి, నాచగిరిలో.. భక్తుల కిటకిట