సర్కారు బడుల్లోనే చేర్పించండి | - | Sakshi
Sakshi News home page

సర్కారు బడుల్లోనే చేర్పించండి

Jun 9 2025 7:54 AM | Updated on Jun 9 2025 7:54 AM

సర్కారు బడుల్లోనే చేర్పించండి

సర్కారు బడుల్లోనే చేర్పించండి

తొగుట(దుబ్బాక): ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బండారుపల్లి మదిర మెట్టు, పెద్ద మాసాన్‌పల్లి గ్రామాల్లో ఆదివారం జరిగిన బడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పెద్ద మాసాన్‌పల్లిలో డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. నిష్టాతులైన ఉపాధ్యాయులచే ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యా బోధన జరుగుతోందన్నారు. విద్యార్థులకు ఆటపాటల్లోనూ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని అన్నారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి బలోపేతం చేయాలని కోరారు. ప్రైవేట్‌ మోజులో పడి తల్లిదండ్రులు తమ రెక్కల కష్టాన్ని వృథాచేసుకోవద్దని సూచించారు. స్థానికంగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని తల్లిదండ్రులను కోరారు. అంతకు ముందు పాఠశాలల కరపత్రాలను ఆవిష్కరించారు.

విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యం

పాఠశాలల బలోపేతం అందరి బాధ్యత

డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement