హుస్నాబాద్: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రేవతి సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని బుధవారం కోర్టు ఆవరణలో ఆమె పూల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి పరిరక్షించుకోవాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యాళ్ల శ్రీనివాస్ రెడ్డి, న్యాయవాదులు కన్నోజు రామకృష్ణ, మురళీ మోహన్, కోర్టు ఉద్యోగులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రి
ఆకస్మిక తనిఖీ
బెజ్జంకి(సిద్దిపేట): స్థానిక ప్రాథమిక ఆస్పత్రిని బుధవారం సిద్దిపేట అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వసతులను, ల్యాబ్, గదులను పరిశీలించారు. ఓపీ, పేషంట్ల వివరాలు తెలుసుకున్నారు. పదవీ విరమణ పొందిన తాత్కాలిక ఉద్యోగి లచ్చవ్వను ఈ సందర్బంగా సన్మానించారు. కార్యక్రమంలో డిప్యుటీ డీఎంహెచ్ఓ ఆనంద్, వైద్యాధికారి మాధురి, కృష్ణతేజ తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణాన్ని పరిరక్షిద్దాం