
● ఎంట్రెన్స్కు నోటిఫికేషన్ విడుదల ● జూలై 29 వరకు దరఖా
నవోదయ పిలుస్తోంది
వర్గల్(గజ్వేల్): జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు బుధవారం నవోదయ ప్రిన్సిపాల్ దాసి రాజేందర్ ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. ప్రవేశ పరీక్ష కోసం జూలై 29 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థి ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుత విద్యాసంవత్సరం ఐదవ తరగతి చదువుతూ ఉండాలని, తల్లిదండ్రులు ఉమ్మడి మెదక్ జిల్లా నివాసులై ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థి 2014 మే1– 2016 జూలై31 మధ్య జన్మించి ఉండాలని వివరించారు. ప్రధానోపాధ్యాయుడి సంతకంతో కూడిన ధ్రువపత్రం, ఫొటోతో ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించాలని సూచించారు. డిసెంబర్ 13న ప్రవేశపరీక్ష జరుగుతుందన్నారు. వివరాల కోసం https//navodaya.gov.in సందర్శించాలన్నారు.