
నకిలీ విత్తనాలపై నిఘా..
సిద్దిపేట కమాన్: నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందుల అమ్మకాలపై నిఘా ఏర్పాటు చేసినట్లు టూ టౌన్ సీఐ ఉపేందర్ తెలిపారు. శుక్రవారం పలు సీడ్స్, ఫెర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. స్టాక్, బిల్ బుక్, తదితర రికార్డులను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎరువులు, విత్తనాలు కొనేసమయంలో బిల్లు, రశీదు తీసుకోవాలని రైతులకు సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన విత్తనాలనే కొనుగోలు చేయాలన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే 100 నంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ తనిఖీల్లో వ్యవసాయ శాఖ అధికారి శ్రీనాథ్, తదితరులు పాల్గొన్నారు.